శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణలపై పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో పరిపాలన అధికారి లక్ష్మినారాయణ అధ్యక్షతన ఆర్డీవో కార్యాలయంలో శనివారం సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ మరణించిన , రెండుసార్లు నమోదైన 324 ఓట్లను ఫారం–7 ద్వారా తొలగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.