MNCL: బెల్లంపల్లి శాంతిఖని గనిలో పలువురు కార్మికులకు బుధవారం ప్రమోషన్ పత్రాలు అందజేశారు. టైమ్ రేటెడ్ ప్రమోషన్ 2025 సంవత్సరానికి గాను నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులు అయిన ఉద్యోగులకు గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా ప్రమోషన్ ఆర్డర్ అందజేశారు. కార్యక్రమంలో సంక్షేమ అధికారి రిబికుమార్, AITUC ఫిట్ కార్యదర్శి తిరుపతి, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.