టీమిండియాలో వికెట్ కీపర్ బ్యాటర్గా సంజు శాంసన్, జితేశ్ శర్మల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కూడా శాంసన్ను కాదని జితేశ్కు అవకాశం ఇచ్చారు. మ్యాచ్ అనంతరం జితేశ్ మాట్లాడుతూ.. జట్టులో ఆరోగ్యకరమైన పోటీ ఉండటం మంచిదే అని చెప్పాడు. శాంసన్ తనకు పెద్దన్నలాంటి వాడని తెలిపాడు. కెరీర్ ప్రారంభంలో అతను తనకు చాలా సహాయం చేసినట్లు పేర్కొన్నాడు.