సంగారెడ్డి జిల్లాలో మొదటి విడత ఏడు మండలాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు 1,100 మంది పోలీసు అధికారులతో భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పరీతోష్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని 129 సర్పంచ్ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఉంటుందని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.