వరంగల్ భద్రకాళి దేవస్థానంలో మార్గశిర మాసం బుధవారం షష్టి తిథి సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించి హారతినిచ్చారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు తదితరులున్నారు.