JGL: గొల్లపల్లి మండలంలోని చిల్వాకోడూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఏఎంసీ ఛైర్మన్ భీమ సంతోష్ ప్రారంభించారు. పాడి రైతులందరూ తమ పశువులకు టీకాలు వేయించి ఆరోగ్యంగా కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి తిరుపతి గౌడ్, కాంగ్రెస్ నాయకుడు నిశాంత్ రెడ్డి, వెటర్నరీ డాక్టర్ రవీందర్ పాల్గొన్నారు.