KNR: హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యటన నేపథ్యంలో జమ్మికుంట పోలీసులు దళిత బంధు సాధన సమితి సభ్యులను ముందస్తుగా అరెస్టు చేశారు. రెండో విడత దళిత బంధు నిధులు మంజూరు చేయాలని నిరసన తెలిపే అవకాశం ఉందని ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దళిత బంధు నిధులు ఇవ్వకుండా అరెస్టులు చేయడం సరికాదని సమితి సభ్యులు మండిపడ్డారు.