TG: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో YS రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల మధ్య రోజుల తరబడి ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి భిన్నాభిప్రాయాలు వెలువరించే సంస్కృతి, స్వేచ్ఛ ఉందన్నారు. భిన్నాభిప్రాయాలు చెప్పినంత మాత్రాన వారిని వేధించే సంస్కృతి లేదన్నారు.