W.G: ఉపాధ్యాయుల సమస్యలపై ఈ నెల 13న ఎంఈవో-1కు అందజేసిన మెమోరాండంపై స్పందన లేకపోవడంతో, యూటీఎఫ్ (UTF) జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు ఆధ్వర్యంలో నిరసనకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 2న నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ముందస్తు నోటీసును బుధవారం డీఈవో నారాయణకు అందజేశారు. ఉండి, భీమవరం యూటీఎఫ్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.