తమిళ హీరో సూర్య, దర్శకుడు లింగుస్వామి కాంబోలో తెరకెక్కిన ‘సికిందర్’ మూవీ 11ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ కాబోతుంది. ఈ నెల 28న రీ-రిలీజ్ కానున్న ఈ సినిమా విషయంలో కొన్ని పొరపాట్లు చేశానని దర్శకుడు లింగుస్వామి తాజాగా చెప్పాడు. ఈ మూవీ విడుదలైనప్పుడు ఎంతోమంది ట్రోల్ చేశారని అన్నాడు. కొందరు కావాలని ట్రోల్స్ చేస్తారని, కానీ అవి ఒక మంచి సినిమాను ఆపలేవు అని తెలిపాడు.