W.G: పాలకోడేరు మండలం కుముదవల్లిలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతన్న మీకోసం” కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి నిర్వహించారు .ఈ సందర్భంగా ఆమె రైతులతో కలిసి అరుగుపై కూర్చుని ముఖాముఖిగా పాల్గొని వారి బాధలను, వరి పంట సాగు గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు.