W.G: భీమవరం ప్రకాశం సర్కిల్లో సోమవారం ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం 100 రోజుల పని కల్పించిందని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం 52 రోజులు కూడా చూపడం లేదని నేతలు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తోందని YS షర్మిల మండిపడ్డారు.