KNR: వీణవంక మండలం శ్రీరాములపేటలో నార్ల కమలమ్మ (70) ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలో ఉన్న సుమారు 2.5 తులాల బంగారు పుస్తెల తాడును చోరీ చేసి పరారయ్యారు. జమ్మికుంట రూరల్ సీఐ కె. లక్ష్మీనారాయణ, వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.