MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించి రోగులకు మందులు అందజేసినట్లు సర్పంచ్ యంజాల స్వామి తెలిపారు. ఓ హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లు స్వామి వివరించారు. పేదలకు వైద్య సహాయం అందజేసేందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.