ఐపీఎల్పై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. IPL ప్రపంచంలోనే అగ్రగామి క్రికెట్ లీగ్ అని.. మారుతున్న కాలానికి అనుగుణంగా లీగ్లో మార్పులు చేయాలని అన్నాడు. IPLలో వేలం ప్రక్రియను తొలగించి ఏడాది పొడవునా ఆటగాళ్లను ట్రేడ్ చేసుకోవడానికి వీలు కల్పించాలని తెలిపాడు. IPLను రెండు నెలల నుంచి ఆరు నెలల టోర్నీగా మార్చాలని సూచించాడు.