JGL: జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సోమవారం ధర్మపురి పట్టణంలో గోదావరి తీరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో పారిశుధ్య పరిస్థితులు, శుభ్రత పనులపై సమీక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు రాబోతున్నందున పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.