కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో క్రీడల అభివృద్ధి కోసం ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ స్కూల్ / స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయను ఢిల్లీలో కలిసి సోమవారం వినతిపత్రం సమర్పించారు. పట్టణానికి ఆనుకుని సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలన్నారు.