NLG: మిర్యాలగూడ బస్టాండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దేవరకొండ వెళ్లే బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు టైరు కిందపడి ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలితో పాటు ఉన్న చిన్న బాబు కూడా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.