JN: రఘునాథపల్లి, ఎల్లారెడ్డిగూడెం, దాసన్నగూడెం గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి గ్రంథాలయ చైర్మన్ రాంబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ… మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు వెళుతుందని, రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.