ATP: రంజాన్ మాసం సందర్భంగా గుత్తి జామియా మసీదులో సోమవారం జామియా మసీదు కమిటీ సభ్యుడు ఖురేషి అన్వర్ ఆధ్వర్యంలో ఉపవాస దీక్షపరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా హాజరయ్యారు. ఉపవాస దీక్షాపరులకు పండ్లు, ఫలహారాలు ఇచ్చి దీక్షను విరామించారు. ముందుగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.