MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, గ్రామ ప్రజలకు మెరుగైన రాకపోకలు కల్పించేందుకు సీసీ రోడ్డు నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.