కృష్ణా: మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామంలో రూ.4.79 లక్షలతో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన స్మశాన వాటిక అభివృద్ధి పనులకు మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.