WGL: ప్రజాపాలన – ప్రజా ప్రణాళికలో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో సోమవారం కాలువల శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగాపాణి పాల్గొని కాలువల శుభ్రత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం మున్సిపాలిటీ ముఖ్య లక్ష్యమని తెలిపారు.