HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేపు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలింగ్పై డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు. అందులో భాగంగా డీఆర్సీ సెంటర్ వద్ద డ్రోన్ డెమో షో నిర్వహించారు. మొత్తం 139 డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ డెమో షోను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పర్యవేక్షించారు.