ADB: నేరడిగొండ మండల కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను చివరి వరకు కొనుగోలు చేసి ఇబ్బందులు కలగకుండా చూడాలని మార్కంపేట్ అధికారులను ఎమ్మెల్యే కోరారు.