MDK: మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో మహిళా భవన నిర్మాణానికి సర్పంచ్ గడప బోయిన భాగ్యలక్ష్మి యాదగిరి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 10 లక్షలు మంజూరయ్యాయి. పాలకవర్గం పాల మంజుల, ముస్కురి ఆంజనేయులు, చేరుపల్లి సంతోష్, కుంట మహేష్, కర్రె నాగేష్, మస్కూరి పోచయ్య పాల్గొన్నారు.