JGL: భీమారం మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ చెక్కపల్లి స్వాతి ఆధ్వర్యంలో గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.