HNK: జిల్లాకు చెందిన జబర్దస్త్ ఫేమ్ రచ్చ రవి తన స్వీయ అనుభవాలతో ‘నీ రుణం తీరేది ఎట్ల’ అనే పుస్తకాన్ని రచించారు. ఈనెల 10వ తేదీన హైదరాబాద్లో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రచ్చ రవి తెలిపారు. ముఖ్య అతిథిగా నటుడు, ఆధ్యాత్మికవేత్త తనికెళ్ల భరణిని ఆహ్వానించారు. ఆదివారం పుస్తక నమూనా ప్రతిని రచ్చ రవి, భరణికి బహూకరించారు.