KRNL: ఆదోని జిల్లా సాధన కోసం కొనసాగుతున్న దీక్షలు ఆదివారం 113వ రోజుకు చేరుకున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా పలు గ్రామాల మహిళలు దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఆదోనిని కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.