ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టీ20లో భారత్కు తొలి షాక్ తగిలింది. 14 బంతుల్లో 4 ఫోర్లతో దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ, నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ గిల్కు తోడుగా సూర్యకుమార్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ 4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది.