టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ‘కుమారి 21F’ మూవీ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించగా.. దర్శకుడు సుకుమార్ కథను అందించారు. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారట. ‘కుమారి 22F’ అనే టైటిల్తో రాబోతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ భార్య తబిత తన కొత్త ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మించనున్నట్లు సమాచారం.