KMM: జిల్లాలో రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై పోలీసులు నిఘా పెంచారు. ఈ మేరకు గత రాత్రి రికార్డుల్లో ఉన్న 225మంది ఇళ్లకు ఆకస్మికంగా వెళ్లిన పోలీసులు కదకలికలపై ఆరా తీశారు. ప్రస్తుత వృత్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ ఒక్కరిపై నిఘా ఉన్నందున ఏ చిన్న తప్పు చేసినా దొరిపోవడం ఖాయమని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు తప్పదన్నారు.