W.G.: భీమవరం కలెక్టరేట్తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయాలకు రాలేనివారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని సూచించారు.