KMM: విద్యాశాఖ పనితీరులో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రశంసించారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని సూచిస్తూ, మార్చి 6 నుంచి 15 వరకు పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ఆదేశించారు. పాత సామాగ్రిని తొలగించి, ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేయాలని స్పష్టం చేశారు.