SKLM: పాతపట్నం మహేంద్ర తనయ నది పక్కన ఉన్న చరిత్ర కలిగిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి కార్తీక మాసం పాడ్యమి బుధవారం విశేష పూజలు అందుకొని ఆకట్టుకునే అలంకరణతో దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలంకరణ గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు భక్తులని ఆకట్టుకున్నాయి. కార్యనిర్వహణ అధికారి, అర్చకులు సంయుక్తంగా కార్యక్రమాలను చేపడుతున్నారు.