GDWL: అలంపూర్ ఆలయాల సందర్శనకు వచ్చిన శృంగేరి శారదా పీఠం పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతి స్వామిని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఎమ్మెల్యే పీఠాధిపతిని కలిసి ఆలయ అభివృద్ధిపై చర్చించారు.