విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శనివారం డీఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు ఎస్పి పి.సౌమ్యలత పాల్గొని రక్తదాతలను ప్రశంసా పత్రాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ కె ప్రసాద్ రావు పాల్గొన్నారు.