TPT: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలగురువం బాబు సత్యవేడు నియోజకవర్గంలో గ్రావెల్ క్వారీల నుంచి భారీగా టిప్పర్ల ద్వారా తరలింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీంతో రోడ్లు ధ్వంసమై దుమ్ము, శబ్ద కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్వారీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.