MBNR: రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీశైలం (16) అనే యువకుడు మృతి చెందాడు. బైక్ పై వెళ్తున్న శ్రీశైలంను మరికల్కు చెందిన బొలెరో వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మరణించాడు.