NRPT: మద్దూరు మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకుల కోసం శనివారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కల్లపు రాకేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ సరస్వతి జనార్ధన్ ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఆసుపత్రికి వచ్చే వారికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.