WGL: రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ విత్తనాలు అందిస్తున్నట్టు నర్సంపేట డివిజన్ హార్టికల్చర్ అధికారి జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె HIT TVతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ రైతుల అభివృద్ధి కోసం పలు సబ్సిడీ పథకాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. అర్హత కలిగిన రైతులు విత్తనాల కోసం వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.