ADB: పేదింటి ఆడపిల్ల కుటుంబానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరం లాంటివని బోథ్ MLA అనిల్ జాదవ్ అన్నారు. శనివారం బజారహత్నూర్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మాజీ CM KCR ప్రవేశపెట్టిన అన్ని పథకాలతో ప్రజలకు మేలు చేకూరిందని పేర్కొన్నారు.