GDWL: అలంపూర్ పురపాలక ప్రజలు 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులను మార్చి 31లోపు చెల్లించాలని కమిషనర్ ఎన్. శంకర్ కోరారు. శనివారం 3వ వార్డులో పన్నుల వసూలు కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు నారాయణ, ఆంజనేయులు, రమేశ్ నాయుడు పాల్గొన్నారు.