ములుగు జిల్లా కేంద్రంలో శనివారం BRS నియోజకవర్గ ఇంఛార్జ్ నాగజ్యోతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. పట్టాలున్నా గిరిజన పోడు రైతులను, ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాడ్వాయి (M)కాల్వపల్లిలో గిరిజన రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూముల్లో కందకాలు తీయడం సరికాదని, ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.