కృష్ణా: మచిలీపట్నం టౌన్ హాలును ఆధునీకరించి పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా శిథిలావస్థకు చేరిన టౌన్ హాలును శనివారం ఆయన పరిశీలించారు. ఆధునిక ఫంక్షన్ హాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండోమెంట్ అధికారులు తయారు చేసిన డిజైన్లను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు.