MNCL: జన్నారం మండలంలో చేపట్టిన ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈజీఎస్ ఏపీవో రవీందర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రత పెరగడంతో అధికారుల ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పని చేయాలని కూలీలకు సూచించడం జరిగిందన్నారు. అలాగే ఎండదెబ్బ తగలకుండా కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేస్తున్నామన్నారు.