కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో కొత్తగా చేపడుతున్న డ్రైనేజ్ నిర్మాణ పనులను పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ శనివారం పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకొని నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.