బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ జి. రఘునాధ రెడ్డి పర్యటించారు. 3వ వార్డు రైలుపేటలో జరుగుతున్న డ్రైనేజ్ పూడికతీత పనులను పరిశీలించి పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ నజీర్కు సూచించారు. అనంతరం అన్న క్యాంటీన్ను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు.