SRPT: నడిగూడెం మండలంలోని NSP కాలువ పరిధిలో ఉన్న సిరిపురం,నారాయణపురం సహా పలు గ్రామాల ప్రజలు కాలువలో బట్టలు ఉతకడం, స్నానం చేయడం వంటివి చేయకూడదని SI జి.అజయ్ కుమార్ ఇవాళ ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కాలువలో నీరు నిండుగా ప్రవహిస్తుండటం వల్ల గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.