NTR: కొండపల్లి పారిశ్రామికవాడలో దారుణం జరిగింది. శ్రామికనగర్కు చెందిన కందిమళ్ల మణి (40) హత్యకు గురైంది. జ్యోతి హోటల్ సమీపంలో ముళ్లపొదల్లో శనివారం ఆమె మృతదేహం లభ్యమైంది. ఉదయం పనికి వెళ్లిన మణి మధ్యాహ్నం హత్యకు గురైంది. ఇద్దరు పిల్లలు ఉన్న ఆమె కంపెనీలో పనిచేస్తుంది. సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.